ప్రజాదర్బార్ నిర్వహించిన ప్రభుత్వ విప్
PPM: గుమ్మలక్ష్మీపురంలో కురుపాం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవాళ కురుపాం శాసనసభ్యులు తోయక జగదీశ్వరి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంకు నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాల నుంచి హాజరైన ప్రజలు తమ గ్రామాలకు సంబంధించిన సమస్యలను ఎమ్మెల్యేకు వినతి రూపంలో అందజేసి వివరించారు. పలు అంశాలపై ప్రజలు తమ ఆవేదనను తెలియజేశారు.