ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
ATP: ధర్మవరం పట్టణం బాలాజీ నగర్లో ఉంటున్న శ్రీరాములు కూతురు ఉష(17) మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది.