'ప్రజల్లో విద్వేషాలు పెంచే కుట్ర'

KMM: తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల విషయంలో ఉద్రిక్తతలు సృష్టించడం ద్వారా ప్రజల్లో చిచ్చు పెట్టాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. నేడు పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతు..ప్రస్తుతం బనకచర్ల-పోలవరం ప్రాజెక్టు కారణం చూపిస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నరన్నారు.