వచ్చే ఏడాది వరకు అగార్కరే

భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని బీసీసీఐ 2026 జూన్ వరకు పొడిగించింది. భారత జట్టుకు కీలక విజయాలు సాధించేలా జట్లను ఎంపిక చేసినందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. 2023 జూలైలో అతడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్గా ఎంపికయ్యాడు. 2024లో టీ20 ప్రపంచకప్.. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలోనూ టీమిండియా విజేతగా నిలిచింది.