రెండు నెలలకోసారి జిల్లాకు వస్తా: పవన్ కళ్యాణ్
KKD: ప్రతి రెండు నెలలకు ఒక సారి కాకినాడ, పిఠాపురంలలో పర్యటిస్తానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. గురువారం ఆయన జిల్లా కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. జిల్లా పరిధిలోని ఏ ఒక్క రోడ్డుపై గుంతలు ఉండకూడదని సూచించారు. ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని పేర్కొన్నారు.