ఓడిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ అభ్యర్థి

ఓడిన మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ అభ్యర్థి

KNR: హుజురాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 21వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన గుర్రం హరిబాబు ఓడిపోయినా తన హామీని నెరవేర్చుకున్నారు. వార్డులో ఏ ఆడబిడ్డ వివాహం జరిగినా రూ. 10,116 ఇస్తానని ఇచ్చిన మాట ప్రకారం యంజాల భాగ్య-వాసుల కుమార్తె శ్రావ్య వివాహానికి హాజరై నగదు అందజేశారు. ఆడపిల్ల పుడితే కూడా రూ. 10,116 మొత్తాన్ని అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు.