నిజాంసాగర్లో మహిళ మృతదేహం
NZB: నిజాంసాగర్ కెనాల్లో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైన ఘటన కలకలం రేపింది. డిచ్పల్లి మండలం ధర్మారం (బి) వద్ద మృతదేహం లభ్యమైనట్లు పోలీసుల తెలిపారు. ఈ ఘటన ఆత్మహత్యా? లేక హత్య? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆమె మృతికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.