రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

VSP: జీవీఎంసీ ప్రధాన కార్యాలయం, జోనల్ కార్యాలయాలలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ ఆదివారం తెలిపారు. సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పారిశుద్ధ్యం, నీటి సరఫరా, వీధి దీపాలు, రెవెన్యూ, తదితర విభాగాల సమస్యలను ప్రజలు అర్జీల ద్వారా తెలియజేయవచ్చని తెలిపారు.