ఆలమూరు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా షరీఫ్
కోనసీమ: ఆలమూరు బార్ అసోసియేషన్ ఎన్నికలు సోమవారం ప్రశాంతంగా జరిగాయి. బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది ఎస్.కె షరీఫ్ ఎన్నికయ్యారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా చల్లా సతీష్, జాయింట్ సెక్రటరీగా గానుగుల శేషారావు, ఉపాధ్యక్షుడిగా కే. ధనరాజు, కోశాధికారిగా బి. విద్యా ప్రసన్నలు తమ ప్రత్యర్థులపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.