జాయింట్ కలెక్టర్కు సర్పంచుల ఫిర్యాదు
SS: పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన PGRS కార్యక్రమంలో సోమందేపల్లి మండలానికి చెందిన సర్పంచులు సోమవారం జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్కు ఫిర్యాదులు చేశారు. గత రెండు సంవత్సరాలుగా గ్రామాల్లో పారిశుద్ధ్యం, త్రాగునీటి వంటి పనులకు ఖర్చు చేసిన నిధుల బిల్లులు డ్రా చేయకుండా నిలిపివేశారని వారు తెలిపారు.