VIDEO: బీఆర్ఎస్ -కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ
NLG: కేతేపల్లి మండలం కొర్లపహాడ్లో నిన్న రాత్రి బీఆర్ఎస్-కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. BRS నాయకులపై కాంగ్రెస్ నాయకులు రాళ్లు, కత్తులతో దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. కాగా ఈ దాడిలో BRSకు చెందిన నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించగా.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.