కొనుగోలు కేంద్రం వద్ద పొగాకు రైతుల ఆందోళన
GNTR: తెనాలిలోని గిడ్డంగుల వద్ద తమ పొగాకు పంటను కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆందోళన చేపట్టారు. బాపట్ల జిల్లా కారంచేడు నుంచి రైతులు తమ పంటను తెనాలి మార్క్ ఫెడ్ కేంద్రానికి తీసుకొచ్చారు. ప్రభుత్వం మూడు గ్రేడ్లుగా ధరలు నిర్ణయించినా, తమ పంటను కనీసం చివరి గ్రేడ్ కింద కూడా కొనడం లేదని బుధవారం రైతులు వాపోయారు.