కాకినాడలో రేపు జాబ్ మేళా

కాకినాడలో రేపు జాబ్ మేళా

KKD: కాకినాడ (D) ఉపాధి కార్యాలయంలో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు సంబంధిత అధికారి జి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. ధూళిపూడి ఇండస్ట్రీ, మెడిప్లస్ వంటి సంస్థల్లో 255 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, టెన్త్ నుంచి డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఆసక్తి గలవారు ఉదయం 10 గంటలకు ధ్రువపత్రాలతో నేరుగా హాజరుకావాలన్నారు.