అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

NTR: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెనుతురుమల్లి గోపాలకృష్ణారావు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదల ప్రకారం అర్చకులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేదాశీర్వచనం అందజేయగా, ఆలయ అధికారులు శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాన్ని అందించారు.