చలివేంద్రాన్ని ప్రారంభించిన డీఎస్పీ
సిరిసిల్ల: పట్టణంలో చలివేంద్రాన్ని సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎండాకాలంలో దాహం తీర్చుకోవడానికి చలివేంద్రాలు చాలా కీలకమన్నారు. ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తీవ్రమైన ఎండలకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు.