ఏఆర్ కానిస్టేబుల్ కోలుకోలేక మృతి

ఏఆర్ కానిస్టేబుల్ కోలుకోలేక మృతి

నంద్యాలలో ఏఆర్ కానిస్టేబుల్ గత శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డాడు. స్థానికులు చికిత్స నిమిత్తం నంద్యాల పట్టణంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కి తరలించారు. కోలుకోలేక గురువారం రాత్రి మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. ఏఆర్ విభాగంలో పనిచేస్తున్న కృష్ణ ప్రస్తుతం డీఎస్పీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.