ప్రశాంతంగా ముగిసిన బంద్
SDPT: గజ్వేల్లో కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రం ఏర్పాటును నిరసిస్తూ BRS చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం పట్టణంలోని వ్యాపార, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ డిపో వద్ద ధర్నా చేపట్టి, భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.