నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు

KNR: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని AO రంజిత్ కుమార్, SI బండి రాజేష్ తెలిపారు. మంగళవారం చిగురుమామిడి మండల కేంద్రంలోని రైతు వేదికలో విత్తన డీలర్లతో సమావేశం నిర్వహించారు. వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రసీదు ఇవ్వాలన్నారు.