రీకౌంటింగ్.. ఒక్క ఓటు తేడాతో విజయం
ఖమ్మం: రఘునాథపాలెం మండలం బద్యాతండాలో సర్పంచ్ ఎన్నికల్లో ఉత్కంఠ నెలకొంది. ఇరువర్గాలకు సమాన ఓట్లు రావడంతో అధికారులు రీకౌంటింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక్క ఓటు తేడాతో ఫలితం విడుదలైంది. దీంతో రెండోసారి రీకౌంటింగ్లో ఒక్క ఓటు తేడాతో బీఆర్ఎస్ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ విజయం పట్ల బీఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.