పోలీస్ కాలనీ ప్రహరీ గోడ ప్రారంభం

NLR: రూరల్ పరిధిలోని 30వ డివిజన్ పోలీస్ కాలనీలో రూ. 40 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రహరీ గోడను రూరల్ టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. ప్రభుత్వ రిజర్వు స్థలాలు, పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని రూరల్ ఎమ్మెల్యే సూచనల మేరకు తగు చర్యలు తీసుకుంటున్నామని గిరిధర్ రెడ్డి తెలిపారు.