సామాజిక పింఛన్లకు నిధులు మంజూరు
ASR: అడ్డతీగల మండలంలో నవంబర్ నెలకు 5248 ఎన్టీఆర్ భరోసా ఫించన్లు పంపీణీ చేస్తున్నట్లు ఎంపీడీవో ఏవీవీ కుమార్ బుధవారం తెలిపారు. ఈ పింఛన్ల కొరకు ప్రభుత్వం రూ.2.17 కోట్లు మంజూరు చేసినట్లు ఎంపీడీవో పేర్కొన్నారు. నవంబర్ 1 శనివారం సచివాలయ సిబ్బంది ఉదయం నుంచి ఇంటింటికి వచ్చి పింఛను పంపిణీ చేస్తారన్నారు. కావున లబ్ధిదారులు ఇళ్ల వద్ద అందుబాటులో ఉండాలని ఎంపీడీవో కోరారు.