YCP మళ్లీ అధికారంలోకి రావాలని ప్రార్థనలు
CTR: ఈసారి జరగనున్న ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని ఆ పార్టీ పుంగనూరు నాయకులు ఆదివారం ప్రార్థనలు చేశారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ PV మిథున్ రెడ్డి తరుఫున ఆదివారం అజ్మీర్లోని దర్గాలో చాదర్ను సమర్పించారు. పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా తమ నాయకులపై అల్లా ఆశీస్సులు ఉండాలని కోరారు.