గాయపడిన విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే
ELR: భీమడోలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులు స్కూల్ నుంచి హాస్టల్కు వెళ్తుండగా పశువులు దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఈ విషయం తెలుసుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గురువారం ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.