'గ్రానైట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'
ఖమ్మం జిల్లాలోని గ్రానైట్ లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఖానాపురం హవేలీ పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. AITUC జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. క్వారీల్లో పనిచేసే కార్మికులు తక్కువ వేతనాలు, సామాజిక భద్రత లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.