అసెంబ్లీని సందర్శించిన నరసరావుపేట విద్యార్థులు

అసెంబ్లీని సందర్శించిన నరసరావుపేట విద్యార్థులు

PLD: ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కోసం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఈశ్వర్ కాలేజ్ విద్యార్థులను గురువారం ఏపీ అసెంబ్లీకి తీసుకువచ్చారు. శాసనసభ కార్యకలాపాలు, సభ నిర్వహణ, ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రాధాన్యతను ఆయన విద్యార్థులకు వివరించారు. అసెంబ్లీని నేరుగా వీక్షించే అవకాశం లభించడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.