జిల్లాలో ముగ్గురు తహసీల్దార్ల బదిలీలు
నెల్లూరు జిల్లాలో ముగ్గురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ హిమాన్షు శుక్లా నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. పీవీ.కృష్ణారెడ్డిని కలువాయి తహసీల్దార్గా, ఎస్.సీతామహాలక్ష్మిని జలదంకి తహసీల్దార్గా, బి.మురళిని ఇందుకూరుపేట తహసీల్దార్గా నియమించారు. వీరితో పాటు మరో నలుగురు డిప్యూటీ తహసీల్దార్లను కూడా బదిలీ చేసినట్లు ఆయన వెల్లడించారు.