హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి

TG: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. 21న మధ్యాహ్నం 1:10 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్తారు. సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు భారతీయ కళా మహోత్సవంలో పాల్గొంటారు. ఈ నెల 22న పుట్టపర్తి బయలుదేరుతారని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.