మదనపల్లిలో యువతి ఆత్మహత్యాయత్నం
అన్నమయ్య: మదనపల్లి నగరంలోని చంద్ర కాలనీలో కుటుంబ కలహాల కారణంగా రూబియా(25) అనే యువతి గురువారం ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి రిఫర్ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.