అక్రమ మద్యం సీసాలు పట్టివేత
SKLM: మెళియాపుట్టి జంక్షన్లో ఎస్సై మహమ్మద్ అమీర్ అలీ ఆధ్వర్యంలో సోమవారం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో రాజపురంకి చెందిన వ్యక్తి బ్యాగ్లో 14 మద్యం సీసాలు అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. అతనిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయం, రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.