భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కలగాలి: ఈవో

భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కలగాలి: ఈవో

NDL: మహానందీశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి భక్తులతో నేరుగా మాట్లాడారు. ఆలయ ఏర్పాట్లు, దర్శనంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కలిగేలా చూడాలని ఆదేశించారు.