నిజాయితీ చాటుకున్న మచ్చేందర్
SRD: కంగ్టి మండలం తుర్కవడ్గంకు చెందిన మచ్చేందర్ కంగ్టిలోని ఓ ఆస్పత్రికి వెళ్లగా అక్కడ కనిపించిన ఓ కవర్ను తీసి చూడగా అందులో తులం బంగారం కమ్మలు ఉన్నాయి. వెంటనే కంగ్టి ఠాణాకు నేడు వెళ్లి పోలీసులకు అప్పగించాడు. అప్పుడే వారు విచారణ చేపట్టి , బంగారం కమ్మలు దుర్గారాజు వని గుర్తించి అప్పగించారు. మచ్చేందర్ నిజాయితికి SI అభినందించారు.