నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్
కృష్ణా: మచలీపట్నంలోని కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో వివిధ శాఖల అధికారులు పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. డివిజన్, మండల స్థాయిలో కూడా పీజీఆర్ఎస్ నిర్వహించి ప్రజలు నుంచి ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుందన్నారు.