చాణక్య పిటిషన్పై ACB కోర్టులో విచారణ
AP: మద్యం కేసు నిందితుడు చాణక్య పిటిషన్పై ACB కోర్టులో విచారణ జరిగింది. జైల్లో తనకు మంచం, కుర్చీ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై విచారణ చేపట్టిన విజయవాడ ACB కోర్టు ఈ నెల 5న నిర్ణయం వెల్లడించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన విజయవాడ జిల్లా జైలులో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్నారు.