వ్యాసరచన పోటీలో గెలుపొందిన ఎస్సై
WNP: జిల్లా కేంద్రంలోని పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో శ్రీరంగాపూర్ ఎస్సై హిమబిందు ఇంగ్లీషు విభాగంలో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. గెలుపొందిన వారికి శుక్రవారం జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ, డీఎస్పీ, సీఐలు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.