దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ

VZM: కొత్తవలస మండలం మంగళ పాలెం గ్రామంలో గల గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ను భారతదేశ మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సందర్శించి దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతమైన చదువులు చదివి మంచి జీవితాన్ని వదిలి 27 సంవత్సరాలలో 2 లక్షల 40 వేల మందికి కృత్రిమ అవయవాలు పంపిణీ చేసిన జగదీష్ బాబును అభినందిస్తున్నట్లు తెలిపారు.