కన్నుమూసినా.. మరో కంటికి వెలుగై..!
W.G: మొగల్తూరుకు చెందిన అలపాటి రాజేశ్ (31) ఈ నెల 22న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. గుంటూరులో చికిత్స పొందుతూ, శనివారం బ్రెయిన్ డెడ్ అవడంతో మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టెడు దుఃఖంలోనూ రాజేశ్ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. తద్వారా మరికొందరికి ప్రాణభిక్ష పెట్టి రాజేశ్ ఆదర్శంగా నిలిచారు.