పదోన్నతులు కల్పిస్తూ నియామక ఉత్తర్వులు అందజేత
ATP: అనంతపురంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఏడుగురు సిబ్బందికి పరిపాలనాధికారులుగా పదోన్నతులు కల్పిస్తూ నియామక ఉత్తర్వులు అందజేశారు. పదోన్నతి పొందిన వారు ప్రజా సేవలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఈవో జీ.శివశంకర్, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ సిబ్బంది పాల్గొన్నారు.