VIDEO: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ మోసం
బాపట్ల జిల్లా మార్టూరులో ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో భారీ సైబర్ మోసం జరిగింది. యువతి వేషంలో పరిచయం పెంచుకున్న మోసగాళ్లు రిటైర్డ్ టీచర్ను నమ్మబలికి మొదట చిన్న పెట్టుబడులకు లాభాలు చూపించి, తరువాత దశలవారీగా రూ.1.09 కోట్లు దోచుకున్నారు. డబ్బు విత్డ్రా సమయంలో అదనపు చార్జీలు కోరడంతో అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.