ధర్మవరంలో అటల్ సందేశ్ యాత్ర ప్రారంభం
సత్యసాయి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల నేతృత్వంలో “అటల్ మోదీ సంకల్ప యాత్ర” రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఈ నెల 11న ధర్మవరంలో ప్రారంభమై, అదే రోజు అనంతపురానికి చేరుకోనుంది. 12న అనంతపురం నుండి కర్నూలుకు ప్రయాణం కొనసాగుతుంది. బస్సు యాత్రలో బహిరంగ సభలు, ప్రజాసమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది.