వాడపల్లి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

వాడపల్లి స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సోమవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఎమ్మెల్యేకు వేద ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.