వైసీపీకి షాక్.. టీడీపీలోకి 16 మంది చేరికలు
NLR: పొదలకూరు మండలం బిరదవోలు పంచాయతీకి చెందిన 16 మంది వైసీపీ సభ్యులు టీడీపీలో చేరారు. వెన్నపూస శ్రీనివాసులు రెడ్డి, రమణారెడ్డిల ఆధ్వర్యంలో నెల్లూరు వేదాయపాళెం కార్యాలయంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి వారు చేరుతున్నారని తెలిపారు.