డిమాండ్ ఉన్న పంటలే సాగయ్యేలా చూడాలి: సీఎం

AP: పంటలు, గిట్టుబాటు ధరలపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంటల వారీ సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. డిమాండ్ ఉన్న పంటలే సాగయ్యేలా చూసి.. రైతులు నష్టపోకుండా చూడాలన్నారు. బర్లీ పొగాకు మెట్రిక్ టన్నుకు రూ.12,000, కోకో కేజీకి రూ.500 ధర చెల్లించాలన్నారు. ఆయా పంటలను కంపెనీలు కొనుగోళ్లు చేసేలా ఆదేశించారు.