టీమిండియాకు ఐసీసీ భారీ ప్రైజ్‌మనీ

టీమిండియాకు ఐసీసీ భారీ ప్రైజ్‌మనీ

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు రూ. 39 కోట్ల 80 లక్షల ప్రైజ్‌మనీ దక్కించుకుంది. రన్నరప్‌గా నిలిచిన సౌతాఫ్రికా జట్టు రూ. 19 కోట్ల 90 లక్షలు అందుకుంది. సెమీఫైనల్స్‌లో ఓడిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ జట్లకు రూ. 9 కోట్ల 94 లక్షలు చొప్పున లభించాయి. కాగా, బీసీసీఐ కూడా భారత మహిళల జట్టుకు రూ.51 కోట్లు ప్రైజ్‌మనీ ప్రకటించింది.