శిరీషను అభినందించిన ఎంపీ

శిరీషను అభినందించిన ఎంపీ

కృష్ణా: న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఏప్రిల్ 25 నుంచి 27 వరకు నిర్వహించిన 2వ ఏషియన్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో బంగారు పతకం సాధించిన బీ.శిరీషను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు. సీనియర్- ఏ విభాగంలో ఆర్టిస్టిక్ పెయిర్ బంగారు పతాకాన్ని సాధించిన శిరీషను బుధవారం విజయవాడలో ఎంపీ కలిశారు.