బీఆర్ నాయుడును ఛైర్మన్గా తొలగించాలంటూ నిరసన
BPT: అద్దంకి మండలం సింగరకొండలో తిరుమల పవిత్రతను కాపాడే దిశగా బీఆర్ నాయుడును వెంటనే ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ నిరసన తెలిపింది. ఈ సందర్భంగా వైపీసీ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ.. తిరుమల దేవస్థానం పవిత్రతను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.