'జిల్లాలో 58 లక్షల మొక్కలు నాటాలి'

MBNR: ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 58 లక్షల మొక్కల్ని నాటాలనే లక్ష్యాన్ని పూర్తిచేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అధికారులతో వన మహోత్సవంపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు 68 శాతం మాత్రమే పూర్తి చేసి రాష్ట్రంలో 12 వ స్థానంలో ఉన్నామని మిగతా లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.