బ్రిడ్జి మరమ్మత్తులు చేయాలని కలెక్టర్కు వినతి

JN: పట్టణంలోని నెహ్రూ పార్క్–జిల్లా ఆసుపత్రి మధ్య ఉన్న రైల్వే బ్రిడ్జి పెచ్చులు ఊడిపోయి ప్రమాదకరంగా మారిందని సీపీఎం నేతలు అన్నారు. దాన్ని మరమ్మతులు చేయాలని కోరుతూ.. జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్కు మంగళవారం వినతి పత్రం అందించారు. అలాగే బ్రిడ్జిపై ఉన్న లైట్లను రిపేర్ చేయాలని, సమీపంలో ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని కోరారు.