గాయత్రి యజ్ఞ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
NLG: నేరేడుగొమ్ము మండలం పేర్వాలలో మద్దిమడుగు జయరాం గురుస్వామి ఆశీస్సులతో గాయత్రి యజ్ఞ మహోత్సవం కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యజ్ఞ వేదికను దర్శించుకొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గురుస్వామి వారు తీర్థప్రసాదాలను అందజేశారు.