ప్రాజెక్ట్ పనులలో జాప్యాన్ని సహించేది లేదు: కలెక్టర్
SKLM: వంశధార ప్రాజెక్ట్ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లో వంశధార ప్రాజెక్ట్ పురోగతిపై అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న పనులను, ముఖ్యంగా రైతులకు సంబంధించిన భూసేకరణ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులు ఆదేశించారు.