స్క్రబ్ టైఫస్ కలకలం.. మహిళ మృతి
VZM: స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడంతో చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందిన రాజేశ్వరి అనే మహిళ గత కొంతకాలంగా జ్వరంతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆసుపత్రికి వెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యులు లోతైన పరీక్షలు చేయగా, స్క్రబ్ టైఫస్ అనే కీటకం కుట్టడడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఇవాళ ఉదయం పలు కేసులు వెలుగులోకి రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.